వైరా టౌన్, అక్టోబర్ 28: బీఆర్ఎస్కు బలం.. బలగం కార్యకర్తలేనని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. వైరా పట్టణంలో శనివారం నిర్వహించిన పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కార్యకర్త ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు మదన్లాల్ మాట్లాడుతూ.. కార్యకర్తలు ఎలాంటి తారతమ్యాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్లీ కరెంటు కష్టాలు తప్పవని, రైతుబంధు, దళితబందు లాంటి పథకాలు నిలిచిపోతాయని, ప్రజలు బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, దిశా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జున్రావు, ఏఎంసీ చైర్మన్ మోహన్రావు, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, మద్దెల రవి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు లాల్మహ్మద్, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు విశ్వేశ్వరరావు, ధనేకుల వేణు, చల్లగుండ్ల నాగేశ్వరరావు, మాదినేని సునీత ప్రసాద్, తడికమళ్ల నాగేశ్వరరావు, దారెల్లి పవిత్రకుమారి, డాక్టర్ కోటయ్య, కృష్ణమూర్తి, కాపా మురళీకృష్ణ, లగడపాటి ప్రభాకర్, సింహాద్రి, బోయినపల్లి కృష్ణమూర్తి, మాదినేని ప్రసాద్, ఏదునూరి శ్రీనివాసరావు, మరికంటి శివ, మిట్టపల్లి సత్యంబాబు, ఏనుగు కృష్ణ, సక్కుభాయి, బీబాసాహెబ్, అప్పం సురేశ్ పాల్గొన్నారు.