తల్లాడ, నవంబర్27 : మేడ్చల్ డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈ నెల 25, 26 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి అంతర్ పాఠశాలల టేబుల్ టెన్నిస్ పోటీల్లో బాలభారతి విద్యాలయం విద్యార్థులు కోటగిరి హితేశ్, ఇ.హరి బంగారు పతకాలు సాధించారు.
రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల చైర్మన్ కోటగిరి ప్రవీణ్, జిల్లా క్రీడా అధికారి పరంధామారెడ్డి, జిల్లా టేబుల్టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగాల సునీల్కుమార్, కోశాధికారి డాక్టర్ శశికుమార్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్, ఉపాధ్యక్షుడు డాక్టర్ నందన్, కార్యదర్శి వీ.ఎస్.మూర్తి అభినందించారు.