బూర్గంపహాడ్, ఆగస్టు 27 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని బత్తులనగర్ గ్రామానికి చెందిన సున్నం మహేశ్ బుధవారం ఐటీసీ సమీపంలో లారీ ట్రాక్టర్ను ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణసాగర్, ఉప సర్పంచ్ భూక్యా మోహనరావు గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో ఆయన వెంట అంతోటి నాగరాజు, గోవింద్, వీరభద్రం తదితరులు ఉన్నారు.