సుజాతనగర్ : కొన్ని రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇగంతో వణికిపోతున్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పల్లెలను మంచు దుప్పటి కప్పేసింది. పొద్దున్నే పొలానికి వెళ్లే రైతులు, వ్యాపారులు చలికి ఇబ్బంది పడ్డారు. స్వెటర్లు ధరించలేనిదే బయటకు వెళ్లడం లేదు.
ఉదయం 9 గంటల వరకు సూర్యోదయం కాకపోవడంతో గ్రామాలలో చీకటి కమ్ముకుంది. మంచుకు సుజాతనగర్ నుంచి కొత్తగూడెం వెళ్లే రహదారి వెంట వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణించారు. ఉదయం వేళలో మంచు కురవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.