అన్నపురెడ్డిపల్లి: మండల కేంద్రంలోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. శనివారం ఆలయంలో శ్రీస్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పురోహితుడు ప్రసాదాచార్యుల వేదమంత్రాల నడుమ శాస్రోక్తంగా శ్రీవారి కల్యాణం జరిపించారు. ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి, కల్యాణం తిలకించారు. ఈసందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండ ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.