చండ్రుగొండ, ఆగస్టు 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో గల రెండు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొరతతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఒక బంక్ పది రోజులుగా పని చేయడం లేదు. మరో బంక్ ఈరోజు పండుగ కాబట్టి స్టాక్ లేకుండా అమ్ముడుపోయిందని బంక్ యజమాని శేఖర్ తెలిపారు. ఈ విషయమై తాసీల్దార్ జగదీశ్వర ప్రసాద్ను సంప్రదించగా పెట్రోల్ కొరతపై సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పెట్రోల్ కొరత లేకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.