చండ్రుగొండ: మున్నూరుకాపు సంఘం బాధ్యులు ఐకమత్యంతో ముందుకు సాగితే తమ హక్కుల్ని సాధించుకోవచ్చని చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. తొలుత తిప్పనపల్లి గ్రామ కమిటి అధ్యక్షులు పసుపులేటి వెంకటేశ్వర్లు మృతికి రెండు నిమిషాలు సంతాపం పాటించారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ…సంఘం పట్ల సభ్యులు బాధ్యతతో ముందుకు సాగాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం మండల అధ్యక్షులు లంకా నరసింహరావు, గౌరవ అధ్యక్షులు శెట్టిపల్లి క్రిష్ణయ్య, సంఘం బాధ్యులు పసుపులేటి వెంకటేశ్వర్లు, చలవాది రామారావు, పులి సత్యం, భూపతి రమేష్, బండి క్రిష్ణ, రామిశెట్టి వెంకటేశ్వర్లు, యాసా కాశీవిశ్వనాథం, రంగిశెట్టి రాము, కొటేశ్వరరావు, చిట్టెంశెట్టి శ్రీను,మక్కా మధు, బూసా శ్రీనివాస్, అంచ అప్పారావు, సుంకర రామారావు, యెన్నం రాములు, ఆకుల రాము, రామిశెట్టి రామారావు, తదితరులు పాల్గొన్నారు.