కొత్తగూడెం:ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తాతా మధు విజయం నల్లేరుపై నడకేనని, ఆయన గెలుపు ఖాయమని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో ఆయన మాట్లాడారు.
తాతా మధు గెలుపు కోసం కృషి చేసిన ప్రజా ప్రతినిధులు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.