– మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్ పాషా
– భద్రాద్రిలో బాలురు, ఖమ్మంలో బాలికలకు కాలేజీలు మంజూరు
– ఈ నెల 8తో ముగియనున్న గడువు
రుద్రంపూర్, ఫిబ్రవరి 06 : మైనారిటీ గురుకుల కాలేజీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన సిఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సి) కాలేజీలను భద్రాద్రి, ఖమ్మం జిల్లాలోని మైనారిటీ, నాన్ మైనారిటీ విద్యార్దులు సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గత కొన్నేళ్లుగా హైద్రాబాద్ కే పరిమితమైన ఈ సిఓఈ కాలేజీలు ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 21 కాలేజీలు అందుబాటులో ఉన్నాయని అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ఖమ్మంలో బాలికలకు, కొత్తగూడెంలో బాలురకు మైనారిటీ సిఓఈ గురుకులాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.
ఈ కాలేజీలలో ఎంపిసి, బైపిసి గ్రూపులు అందుబాటులో ఉన్నాయని, కార్పోరేట్ కాలేజీలకు ధీటుగా విద్యా బోధనతో పాటు ఉచితంగా మెటిరియల్, నిష్ణాత్తులైన సిబ్బంది చేత బోధన జరుగుతుందన్నారు. కావునా ఆసక్తి గల మైనారిటీ, నాన్ మైనారిటీ విద్యార్థులు తమ వివరాలను tmreistelangana.ccgg.gov.in వెబ్సైట్లో ఈ నెల 8వ తేదీ లోపు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష ఈ నెల 14న ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని బాల, బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర సమాచారం కోసం 8520860785 నంబర్ లో సంప్రదించాలన్నారు.