రుద్రంపూర్ , ఏప్రిల్ 23 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో విద్యార్థుల కోసం సమ్మర్ కోచింగ్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు తెలిపారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 18 సంవత్సరాల లోపు బాల బాలికలకు ఈ కోచింగ్ తరగతులు ఏప్రిల్ 27 నుండి మే 21 వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించబడతాయన్నారు. విద్యార్థులకు ప్రాథమిక అంశాలతో పాటు మెరుగైన మార్గదర్శకత్వం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
ఫుట్ బాల్, సాధన గ్రౌండ్స్, రామవరం
వాలీబాల్, ప్రొ.జయశంకర్ స్టేడియం, గౌతంపూర్
అథ్లెటిక్స్, ప్రొ.జయ శంకర్ స్టేడియం, గౌతంపూర్
కిక్ బాక్సింగ్, రెస్క్యూ గ్రౌండ్స్, 3 ఇంక్లయిన్ ప్రాంతాల్లోని గుర్తించిన కేంద్రాల్లో ఈ శిక్షణ కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఉదయం 6.00 గంటల నుండి 8.00 గంటల వరకు అలాగే సాయంత్రం 5.00 గంటల నుండి 6.30 గంటల వరకు క్లాసుల నిర్వహణ ఉంటుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, సమీప కేంద్రాలలో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమ్మర్ కోచింగ్ ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.