పాల్వంచ, మార్చి 13 : భూపాలపల్లిలోని కేటీపీపీ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి టీఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్స్ టోర్నమెంట్ అండ్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో కేటీపీఎస్ ఏడో దశ జట్టు ఘన విజయం సాధించింది. క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో కేటీపీఎస్ ఏడో దశ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి ట్రోఫీలను కైవసం చేసుకున్నారు.
షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్లో ప్రథమ, డబుల్స్లో ప్రథమ, టీమ్ ఈవెంట్లో ద్వితీయ బహుమతి సాధించారు. క్రికెట్లో రెండో స్థానంలో నిలిచారు. కాగా.. వీరిని కేటీపీఎస్ ఏడో దశ సీఈ వెంకటేశ్వరరావు బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఈలు యుగపతి, డీఈ ఎస్ఎన్ఎస్ శేఖర్, జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.