ఖమ్మం : సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయ చట్టాలపై అవగాహన ఉండాలని ఖమ్మం థర్డ్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జి కుమారి పూజిత అన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రజలకు న్యాయ చట్టాలపై అవగాహన కల్పించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కోయచలక, రేగులచలక గ్రామాల్లో సదస్సు నిర్వహించారు. దీనికి ఖమ్మం కోర్టు జడ్జిలు కుమారి పూజిత, 2వ అదనపు జడ్జి మౌనికలు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ఎదుర్కొనే సమస్యల నుంచి పలు చట్టాలను గురించి ప్రజలకు వివరించారు.
ఖమ్మం జిల్లాలో ఈ సదస్సులను నవంబర్ 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ పద్మావతి, న్యాయవాదులు రామలక్ష్మి, నారాయణ, పారా లీగల్ వాలంటీర్లు గుండెపునేని జయ, కోమల, సుభానీ, శంకర్, రామలక్ష్మి, ఖమ్మం రూరల్ సిఐ సత్యనారాయణరెడ్డి, ఎసై వరాల శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు బానోతు ప్రమీల, కోయచలక సర్పంచ్ మాదంశెట్టి హరిప్రసాద్, రేగులచలక సర్పంచ్ కొర్లపాటి రామారావు, ఉపసర్పంచ్ నున్నా వెంకటేశ్వర్లు, తోట వెంకటేశ్వర్లు, నున్నా రమేష్, బాబు, పాఠశాల హెచ్ఎం అనిత తదితరులు పాల్గొన్నారు.