చండ్రుగొండ, డిసెంబర్ 22: అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో 113 మంది క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను అందజేశారు. అదేవిధంగా ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందజేశారు.
ఆసుపత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ను ప్రారంభించారు. వైద్య సిబ్బందికి డ్యూటీ దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల’ పేరుతో పౌష్టికాహారాన్ని అందిస్తోందని అన్నారు. అలాగే క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు.
అనంతరం గ్రామస్తులు వివిధ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రాలు సమర్పించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు బానోత్ పార్వతి, జిల్లా సయ్యద్ రసూల్, దారా వెంకటేశ్వరరావు, లంకా విజయలక్ష్మి,భూక్య రాజి, ఇర్పా లక్ష్మీపతి, బానోత్ కుమారి, నల్లమోతు వెంకటనారాయణ, దారా బాబు, భూపతి రమేశ్, మేడా మోహన్రావు, జడ వెంకయ్య, సంగొండి రాఘవులు, భూపతి శ్రీనివాసరావు , మద్దిరాల చిన్నపిచ్చయ్య, సత్తి నాగేశ్వరరావు, గుగులోత్ రమేష్, వంకాయలపాటి బాబురావు, గుగులోత్ శ్రీనివాస్నాయక్, అబ్బాస్అలీ, రామరాజు, ఏసురత్నం, ఆంటోని, రవికుమార్, అన్నపూర్ణ, వెంకటప్రకాశ్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
సెమీ క్రిస్మస్ వేడుకలు..
అశ్వారావుపేట, డిసెంబర్ 22:అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంటలో గురువారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చీలో కేక్ కట్ చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, సాధు జ్యోత్స్యబాయి, భారతీ, మందపాటి రాజమోహన్రెడ్డి, వెంకటరత్నం, ఎస్సై కిశోర్రెడ్డి పాల్గొన్నారు.