తిరుమలాయపాలెం, ఏప్రిల్ 25 : తమకు కనీస వేతనాలు ఇప్పించాలని ఆశా వర్కర్లు, అంగన్వాడీలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మొర పెట్టుకున్నారు. ప్రజాదర్బాదర్ సందర్భంగా శనివారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటికి వీరంతా వినతిపత్రం సమర్పించారు.
మండలంలోని సుబ్లేడులో శనివారం సాయంత్రం జరిగిన ప్రజా దర్బార్ సభకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ దీపికలు, ఆశా వర్కర్లు మంత్రికి తమ సమస్యలను విన్నవించుకున్నారు. కనీస వేతనం నెలకు రూ. 26,000 చెల్లించాలని ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి వశ పొంగు వీరన్న తదితరులు పాల్గొన్నారు.
