భద్రాచలం, ఏప్రిల్ 15 : భద్రాచలంలో శ్రీరామ నవమి, పట్టాభిషేకం మహోత్సవాలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సోమవారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. భక్తుల కొరకు పార్కింగ్ స్థలాలు, లడ్డూ కౌంటర్లు, సెక్టార్ల వివరాలను తెలియజేస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం తరఫున క్యూఆర్ కోడ్ను, అలాగే ఆన్లైన్ లింక్ను (Error! Hyperlink reference not valid. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.