బోనకల్లు, నవంబర్ 24: తెలంగాణలో దళితబంధు పథకాన్ని తెచ్చింది, ఇచ్చింది సీఎం కేసీఆరేనని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని స్పష్టం చేశారు. ఆయా పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ వర్గాల ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారని వివరించారు. మండలంలోని ముష్టికుంట్ల ఎస్సీకాలనీలో వివిధ పార్టీలకు చెందిన 50 కుటుంబాల వారు గురువారం రాత్రి టీఆర్ఎస్లో చేరగా.. వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గద్దల రవీందర్బాబు అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితుల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పైలట్ ప్రాజెక్టుగా చింతకాని మండలాన్ని ఎంపిక చేశారని గుర్తుచేశారు. ఈ మండలంలో 3,642 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారని వివరించారు.
టీఆర్ఎస్ పథకాలకు ఆకర్షితులై ప్రజలందరూ టీఆర్ఎస్లో చేరుతున్నారని, వారందరికీ అండగా ఉంటామని అన్నారు. టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు బంధం శ్రీనివాసరావు, వేమూరి ప్రసాద్, కొండా, జాన్బీ, వెంకటేశ్వర్లు, శాంతయ్య, గద్దల వెంకటేశ్వర్లు, నజీర్, బంధం నాగేశ్వరరావు, గద్దల రవీందర్, కాకాని శ్రీనివాసరావు, యనిగండ్ల మురళీ, హుస్సేన్, ప్రసాద్, సీతారాములు, దొప్పా కృష్ణ, ఇబ్రహీం, కొట్టె నరేశ్, యనిగండ్ల మురళి, బోయినపల్లి వెంకటరాజ్యం పాల్గొన్నారు.