నమస్తే నెట్వర్క్: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని మతాలకూ సమ ప్రాధాన్యం కల్పిస్తున్నారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా మధిర, పాలేరు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లోని ఆయా ప్రజాప్రతినిధులు పేద క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. చింతకాని రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కమల్రాజు పాల్గొని పేద క్రైస్తవులకు కానుకలను అందజేసి మాట్లాడారు. అనంతరం కేక్ కట్ చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
రఘునాథపాలెం, డిసెంబర్ 23: క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం పంపిన క్రిస్మస్ కానుకలను మంచుకొండ నిరీక్షణ మందిరంలో శుక్రవారం పంపిణీ చేశారు. తహసీల్దార్ నర్సింహారావు, ఎంపీడీవో రామకృష్ణ , మంత్రి పువ్వాడ పీఏ రవికిరణ్లు పాల్గొన్నారు. రఘునాథఫాలెం మండల పాస్టర్స్ ఫెలోషిప్ మండలాధ్యక్షుడు సంజీవరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.