కొత్తగూడెం సింగరేణి, మార్చి 1 : సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పిత్తి లక్ష్యానికి చేరువైంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు 6,67,86,400 టన్నులకు గాను 6,01,27,365 టన్నులు సా ధించి, లక్ష్య సాధనకు అతి దగ్గరలో ఉంది. ఈ ఏడాది అధిక వర్షాలు, సమ్మెలు జరిగినప్పటికీ కార్మికులు, అధికారులు సమష్టి కృషితో ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 66,59, 035 టన్నుల బొగ్గు ఉత్పత్తి అవసరం ఉంది. అలాగే రోజుకు చేయాల్సిన బొగ్గు ఉత్పత్తి కంటే 56,097 టన్నులు ఉత్పత్తిలో కూడా వెనుకబడి ఉంది. వీటన్నింటినీ మిగిలిన 30 రోజుల వ్యవధిలో అధిగమించాలి. అందుకు పక్కా ప్రణాళికలతో యంత్ర సామర్థ్యాన్ని ఎక్కువగా వినియోగించుకొని లక్ష్యాన్ని చేరుకోవాలి. అధికారులు, కార్మికులు సమష్టి కృషితో రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషిచేయాల్సిన అవసరం ఉంది. కాగా, కొ న్ని ఏరియాల్లో నెల ముందుగానే ఉత్పత్తి లక్ష్యం పూర్తిచేశారు. అందుకు కృషిచేసిన అధికారులు, కార్మికులను జీఎంలు అభినందిస్తున్నారు.
ఆర్కే-5 గనిపై అభినందన సభ..
శ్రీరాంపూర్, మార్చి 1 : శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-5గని.. తన ఉత్పత్తి లక్ష్యాన్ని నెల ముందుగానే పూర్తిచేసింది. ఈ ఆర్థిక సంవత్సరం 2,70,321 టన్నుల లక్ష్యాన్ని 100 శాతం పూర్తిచేసింది. ఈ మేరకు బుధవారం గనిపై ఏర్పాటు చేసి కార్మికుల అభినందన సభలో గని డీవైజీఎం(ఏజెంట్) ఏవీ రెడ్డి, గని మేనేజర్ అబ్దుల్ ఖాదర్ కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మర్చి నెలలో ఈ గని తీసే ఉత్పత్తి అదనంగాఉంటుందన్నారు. గని ఓఎంఎస్ 1.1 శాతం సాధించిందని తెలిపారు. కార్మికులు, అధికారులు, సూపర్వైజర్లు సమష్టి కృషి చేసి గని లక్ష్యాలు సాధించారని కొనియాడారు. ఈ సందర్భంగా కార్మికులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్రెడ్డి, గని సేఫ్టీ ఆఫీసర్ శివ య్య, గ్రూప్ ఈఈ వీర న్న, సహాయ మేనేజర్ రాందాస్, ఈఈ సందీప్, వర్క్మన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, పిట్ కార్యదర్శు లు మహేందర్రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.