నెట్వర్క్ ;ఈవీఎంలలో ఓటు వేయడంపై అవగాహన, ఓటు హక్కు వినియోగం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా అధికారులు శనివారం చేపట్టిన ‘ఐ ఓట్ ఫర్ ష్యూర్’ కార్యక్రమం విజయమంతమైంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 5కే రన్ కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు, క్రీడాకారులు, యువతీ యువకులు, అధికారులు పెద్ద సంఖ్యలో ఈ రన్లో పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ వినీత్, ఖమ్మంలో సీపీ విష్ణు ఎస్ వారియర్, కేఎంసీ కమిషనర్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.