అభివృద్ధిలో అగ్రగామిగా మేజర్ పంచాయతీ
రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు
సుందరంగా పల్లెప్రకృతి వనం
మహానుభావుల విగ్రహాలతో భక్తిమార్గ్
హరితహారంలో నాటిన 32,660 మొక్కలు
గద్వాల/మల్దకల్, మార్చి 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగించిన పల్లెప్రగతితో మల్దకల్ రూపురేఖలే మారిపోయాయి. రూ.2 కోట్లతో మేజర్ పంచాయతీలో అభివృద్ధి పనులు జరిగాయి. పల్లెప్రకృతి వనాన్ని సుందరంగా నిర్మించారు. రూ.10 లక్షలతో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలో రూ.38 లక్షలతో మహానుభావులైన కాళిదాసు, అన్నమాచార్య, వేమన, తిక్కన్న విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తి మార్గ్గా నామకరణం చేశారు. హరితహారంలో 32,660 మొక్కలను నాటారు. 600 ఎల్ఈడీ బల్బులు, రూ.7 లక్షలతో బిగించిన ఐదు హైమాస్ట్ లైట్లతో గ్రామం కాంతులీనుతున్నది. రూ.45 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. పంటల సాగులో మెళకువలు తెలుసుకునేందుకు రైతు వేదిక, సేకరించిన చెత్త కోసం సెగ్రిగ్రేషన్ షెడ్డు, చివరి మజిలీ ప్రశాంతంగా జరిగేలా వైకుంఠధామం అందుబాటులో ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రా మపంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. జనాభా ప్రాతిపాదికన మూడు నెలలకోసారి ప్రభుత్వం ప ల్లెప్రగతి కింద నిధులు విడుదల చేస్తున్నది. సీమాంధ్ర పాలనలో గ్రా మాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందం గా ఉండేది. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేసేవారు.. సరైన నీటి వసతి ఉండేకాదు.. ఎవరైనా చ నిపోతే పూడ్చేందుకు జాగా ఉండేది కాదు.. రైతులు సమావేశమయ్యేందుకు వేదికలు లేకపోయేది.. దీంతో రై తులు గ్రామాల్లో దేవాలయాలు లేదా ఇతర ప్రాంతాల్లో సమావేశా లు ఏర్పాటు చేసుకునేవారు. అయితే, టీఆర్ఎ స్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయి. గ్రామ పంచాయతీల్లో వారి వనరు లు వారే సమకూర్చుకునేలా చర్యలు చేపట్టిం ది. ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి ద్వారా గ్రా మాల్లో అన్ని రకాల మౌలిక వసతులు సమకూరాయి. ప్రభుత్వం, గ్రామస్తుల సహకారంతో జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది.
అభివృద్ధిలో అగ్రగ్రామి..
మల్దకల్ మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. గ్రామంలో 10,250 జనాభా ఉన్నది. గ్రామస్తులు 90 శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. మురుగునీరు బయటకు వెళ్లకుండా 343 ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నారు. పంచాయతీలో 600 ఎల్ఈడీ బల్బులతోపాటు రూ.7 లక్షలతో ఐదు హైమాస్ట్ లైట్లు ఏ ర్పాటు చేశారు. దీంతో గ్రామం విద్యుత్ కాంతుల్లో జిగేల్మంటున్నది. పంచాయతీలో నిత్యం ఇంటింటికీ తిరిగి సేకరించిన చెత్తను ట్రాక్టర్ ద్వారా రూ.2.40 లక్షలతో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డుకు తరలిస్తున్నారు. గ్రామంలో రూ.12 లక్షలతో శ్మశానవాటిక నిర్మించా రు. సుమారు రూ.45 లక్షలతో పంచాయతీలో సీసీరోడ్లతోపా టు డ్రైనేజీలు ఏ ర్పాటు చేశారు. పల్లెప్రగతిలో భా గంగా సుమారు 40 పాడుబడ్డ ఇండ్ల ను కూల్చివేశారు. ట్రా క్టర్, వాటర్ ట్యాంకర్ను సుమారు రూ.9 లక్షలతో కొ నుగోలు చేశారు. వేంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే వారితోపాటు గ్రామస్తు లు వినియోగించుకునేందుకు వీలుగా రూ.10 లక్షలతో మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. భక్తులను ఆకట్టుకునేలా కాలిదాసు, అ న్నమాచార్య, వేమన, తిక్కన వంటి మహానుభావుల విగ్రహాలు రోడ్డు వెంట ఏర్పాటు చేసి.. భక్తిమార్గ్గా నామకరణం చేశారు. ఇందుకోసం భక్తు లు, దాతల సహకారంతో సుమారు రూ.38 లక్షలు వెచ్చించారు. రూ.22 లక్షలతో రైతు వేదిక నిర్మించారు.
సుందరంగా పల్లెప్రకృతి వనం..
మల్దకల్ గ్రామంలో రెండెకరాల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం సుందరంగా ఉ న్నది. వివిధ రకాల పూల మొక్కలు నాటారు. మట్టితో వాకింగ్ ట్రాక్, పార్కులో సేద తీరేందుకు బేంచీలు ఏర్పాటు చేశారు. పా ర్కుకు వెళ్లే వారిని ఆకట్టుకునేందుకుగానూ బండి గిర్రలు ఏర్పాటు చేసి రంగులు వేశారు. వి శ్రాంతి తీసుకుంనేదుకు గుడిసె వేసి అందులో బేంచీలు ఏర్పాటు చేశారు. పల్లెప్రకృతి వనంలో ఆరు వేల మొక్కలు, గ్రామం మొత్తం 32,660 మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వ నం బయట భాగంలో రాళ్లకు ఏర్పాటు చేసిన పక్షులు, జంతువుల ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి.
ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి..
ప్రభుత్వ సహకారంతో మల్దకల్ గ్రామ పంచాయతీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నా. పల్లెప్రగతి, పంచాయతీ నిధులు సుమారు రూ.2 కోట్లతో వివిధ పనులు చేపట్టాం. ఇంకా చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. మా గ్రామాన్ని జిల్లాలోనే ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా.
ఇవి కూడా చుడండి
మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం
పెండింగ్ బిల్లులకు 60 వేలు లంచం