గోదాములను తొందరగా అందుబాటులోకి తీసుకురండి
ఎఫ్సీఐ సీఎండీకి మహబూబాబాద్ ఎంపీ కవిత వినతి
భద్రాచలం, ఆగస్టు 11: రైతులకు, రైస్ మిల్లర్లకు సహకరించాలని ఎఫ్సీఐ సీఎండీ అతీశ్ చంద్రను మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కోరారు. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలోని ఆయనను కలిసిన వినతి అందించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం దేశానికి ధాన్యాగారంగా మారిందని, నిల్వ సామర్థ్యానికి మించి ధాన్యపురాసులు ఉన్నాయని అన్నారు. వీలయినంత త్వరగా టెండర్లు పిలిచి ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) గోదాములను అందుబాటులోకి తేవాలని కోరారు. టీఆర్ఎస్ ఎంపీలు బండా ప్రకాశ్, బడుగు లింగయ్య యాదవ్, మహబూబాబాద్ జిల్లా రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.