మధిర, జూలై 3: బీఆర్ఎస్ సర్కారులోనే రైతులు భరోసాగా బతుకుతున్నారని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే రైతును రాజు చేసిందని అన్నారు. పోరాడి సాధించిన తెలంగాణను తీర్చిదిద్ది అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని స్పష్టం చేశారు. ఇలాంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడం ఎవరితరమూ కాదని తేల్చిచెప్పారు. మధిర మార్కెట్ యార్డులో సోమవారం జరిగిన ఏఎంసీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమానికి పాటుపడుతున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు.
రైతుల కోసం సీఎం కేసీఆర్ ఇక్కడ అమలు చేస్తున్నలాంటి పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కనీసం ప్రజా సమస్యలు పట్టించుకోకుండా పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రైతు సమస్యలు పరిష్కరించడం కోసం చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే వారి విశ్వాసాన్ని పొందుతారని అన్నారు. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేలా ప్రజలు కంకణబద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. టీఎస్ సీడ్స్, జడ్పీ, డీసీసీబీ చైర్మన్లు కొండబాల కోటేశ్వరరావు, లింగాల కమల్రాజు, కూరాకుల నాగభూషణం, ఇతర ప్రజాప్రతినిధులు నల్లమల వెంకటేశ్వరరావు, నున్నా నాగేశ్వరరావు, మొండితోక లత, మెండెం లలిత, బొమ్మెర రామ్మూర్తి, చేబ్రోలు మల్లికార్జునరావు, పెంట్యాల పుల్లయ్య, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, దేవరకొండ శిరీష, పూర్ణయ్య, శీలం విద్యాలత, వేమూరి ప్రసాద్, బాణోతు కొండ, చావా రామకృష్ణ, రంగిశెట్టి కోటేశ్వరరావు, మంకెన రమేశ్, తమ్మారపు బ్రహ్మయ్య, గుర్రం రామారావు తదితరులు పాల్గొన్నారు.
ముందుగా మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బంధం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్గా కటికల సత్యనారాయణరెడ్డి, పాలకమండలి సభ్యులతో ఏఎంసీ ప్రధాన కార్యదర్శి జీ.సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు.