కాల్వశ్రీరాంపూర్, డిసెంబర్ 4: అర్హులైన యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పెద్దపల్లి ఆర్డీవో వెంకటమాధవరావు సూచించారు. కాల్వశ్రీరాంపూర్, పెద్దరాత్పల్లి, చిన్నరాత్పల్లిలో ప్రత్యేక ఓటు నమోదు కేంద్రాలను ఆదివారం పరిశీలించారు. గ్రామం నుంచి వెళ్లి పోయిన, వివాహమైన వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించాలని బీఎల్వోలకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనుపమ, గిర్దావర్ వైశాలి ఉన్నారు.
ఎలిగేడు, డిసెంబర్ 4: అర్హులైన ప్రతి ఒకరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎంపీపీ స్రవంతి-మోహన్ రావు పిలుపునిచ్చారు. లాలపల్లిలో ఓటరు నమోదు కేంద్రాన్ని సంబధిత తహసీల్దార్, ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె ఆదివారం సందర్శించారు. ఇక్కడ సర్పంచ్ సింగిరెడ్డి ఎల్లవ్వ, తహసీల్దార్ నాగరాజమ్మ, ఆర్ఐ, నాయకులు బద్ధం తిరుపతి రెడ్డి, రాజేశం పాల్గొన్నారు.
జ్యోతినగర్(రామగుండం), డిసెంబర్ 4: మండలంలో కొనసాగుతున్న ఓటరు నమోదును రామగుండం తహసీల్దార్ ఎండీ జాహెద్ పాషా పలు కేంద్రాలను పరిశీలించారు. ఇక్కడ నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్గౌడ్, బీఎల్వో సూపర్వైజర్లు, బీఎల్వోలు ఉన్నారు.
కమాన్పూర్, డిసెంబర్ 4: జూలపల్లిలో తహసీల్దార్ దత్తు ప్రసాద్ ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొల్లపెల్లి శంకర్ గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్, బీఎల్వోలు పాల్గొన్నారు.
మంథని, డిసెంబర్ 4: ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ బండి ప్రకాశ్ సూచించారు. మంథనిలో ఓటరు నమోదు కేంద్రాలను పరిశీలించారు. ఈ నెల 8వ తేదీ వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
కోల్సిటీ, డిసెంబర్ 4: ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియ రామగుండం మండల పరిధిలో ఆదివారం ముగిసింది. గోదావరిఖని, ఎన్టీపీసీ, రామగుండం, యైటింక్లయిన్ కాలనీ పట్టణాల పరిధిలో దాదాపు 200ల పై చిలుకు పోలింగ్ కేంద్రాల్లో నాలుగు రోజులు బీఎల్వోలతో ప్రత్యేక ఓటరు నమోదు డ్రైవ్ చేపట్టారు. రామగుండం తహసీల్దార్ ఎండీ జాహిద్పాషా గోదావరిఖనిలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటరు నమోదు సరళి ఎంత శాతం పూర్తయిందో అడిగి తెలుసుకున్నారు. అలాగే సోమవారం నుంచి ప్రతి బీఎల్వోలు తమ పరిధిలో ప్రతి ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా తయారు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది శ్రీనివాస్ గౌడ్, సూపర్వైజర్లు, బీఎల్వోలు పాల్గొన్నారు.
రామగిరి, డిసెంబర్ 4: రత్నాపూర్లోని పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ చల్లా రాంమోహన్ పరిశీలించారు. సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు, ఎంపీటీసీ ధర్ముల రాజ సంపత్, ఆర్ఐ పొట్ట రాజబాబు, బీఎల్వోలు విజయలక్ష్మి, గడ్డం సునీత, స్వరూప, శాంతకుమారి, లక్ష్మణ్, కొండు వేణు, దాసరి రవి, అభిలాశ్, తిరుపతి, స్వామి, బాలకృష్ణ, రమేశ్, బోగె సతీశ్, మల్లేశ్ ఉన్నారు.