సిరిసిల్ల/వేములవాడ/ఎల్లారెడ్డిపేట, నవంబర్ 6: వేములవాడ పట్టణంతోపాటు ఎల్లారెడ్డిపేట మండలంలో సోమవారం నిర్వహించిన యువ ఆత్మీయ సమ్మేళనాలకు దాదాపు రెండు వేల మంది యువకులు తరలిరావడంతో విజయవంతం అయ్యాయి. యువకులు బైక్ ర్యాలీలు తీస్తూ సమ్మేళనాలకు తరలివచ్చారు. ముఖ్యఅతిథి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన ప్రసంగంతో యువతలో జోష్ నింపారు. రామన్న ప్రసంగిస్తున్న సేపు చప్పట్లు, కేరింతలతో సభాప్రాంగణాలు మార్మోగాయి. ఎల్లారెడ్డిపేటలో సింగారం దేవరాజు రూపొందించిన సంబురం సీడీని, అక్కపల్లి నవీన్రెడ్డి రూపొందించిన కారు చిత్రాన్ని ఆవిష్కరించారు. రాజన్నపేటకు చెందిన చెక్కపల్లి మహేశ్ తయారుచేసిన బాణం కేటీఆర్కు అందించగా, వేదికపై అదే బాణం సం దించగా యువకులు కేరింతలుకొట్టారు.
సీఎం కేసీఆర్పై చిన్నారి బాలుడు తారకరామ్ పాట పాడి తన అభిమానాన్ని చాటుకున్నాడు. సమ్మేళనాల్లో నిజామాబాద్ రూరల్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చ్మైన్ కొండూరి రవీందర్రావు, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సీనియర్ నాయకులు లోకబాపురెడ్డి, ఏను గు మనోహర్రెడ్డి, ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ లక్ష్మణ్రావు, ఓయూ జేఏసీ చైర్మన్ మందాల భాసర్, ఓయూ విద్యార్థి నాయకులు ఈర్లపల్లి రాజు, వెంగళ శ్రీకాంత్గౌడ్, మందా రాజేందర్, గుండెకార్ల నరేశ్, జీవన్గౌడ్, వనపట్ల సందీప్రెడ్డి, పోతు అనిల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, యువజన విభాగం నాయకులు జక్కుల నాగరాజు, గడ్డమీది శ్రీకాంత్రెడ్డి, సంతోష్గౌడ్, ప్రశాంత్, ఎడవోయిన రత్నాకర్, మహేశ్, యూత్ నాయకులు ఎడ్ల లక్ష్మణ్, సామల్ల దేవరాజు, నాగరాజు, అనిల్, కొత్త సంతోష్, ల్యా గల సతీశ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, మెంగని మనోహర్, ఆయా గ్రామాల యూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల రూరల్ 6: సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు వెల్లువెత్తా యి. సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు, యువజన, కులసంఘాలతో పాటు మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పార్టీలో మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అమాత్యుడు రామన్న వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. దీంతో తెలంగాణభవన్లో గులాబీల సందడి నెలకొన్నది.
మంత్రి కేటీఆర్ చేస్తున్న అభివృద్ధి, కేసీఆర్ సర్కార్ ప్రశేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లోకి నాయకులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. జిల్లాలో వైఎస్సార్టీపీ పార్టీ మొత్తం ఖాళీ అయ్యింది. జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాముతోపాటు మండలాల శాఖల కార్యవర్గాలు మూకుమ్మడిగా బీఆర్ఎస్లో చేరాయి. తంగళ్లపల్లి మండలంలోని వైఎస్సార్టీపీ మండలశాఖ నాయకులు, కేసీఆర్ నగర్లోని బీజేపీ నాయకులు 12మంది, కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మకాలనీ నుంచి 30మంది, చీర్లవంచ ముదిరాజ్ సంఘం సభ్యులు 20మంది, బీజేవైఎం నాయకులు 27మంది, మండల యువజన నాయకులు 35మం ది, సిరిసిల్ల పట్టణశాఖ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సాయికృష్ణ ఆధ్వర్యంలో 10మంది, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో 20మంది యువకులు,
స్థానిక 11వ వార్డుకు చెందిన 11మంది బీజేపీ నాయకులు, గంభీరావుపేట మండలం ముస్తఫానగర్కు చెందిన వెఎస్సార్టీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు మారబోయిన రాజరమేశ్, 15మంది అనుచరులు, ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని కాంగ్రెస్ యూత్ నాయకులు 20మంది, బీజేపీ నాయకులు 15మంది, ముస్తాబాద్ మండలం గూడూరు రజక సంఘం సభ్యులు, గూడెం నుంచి బీజేపీకి చెందిన 8మంది, బంధనకల్లోని బీజేపీకి చెందిన యువకులు 54మంది, తంగళ్లపల్లి మండలం ఒడ్డె ర సంఘం, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపూర్లో అప్స ర మహిళా సంఘం సభ్యులు, సిరిసిల్లలోని ఆసాముల సమన్వయ కమిటీ, పద్మబ్రాహ్మణ సంఘం, అంబేద్కర్ యువజన సంఘం 50మంది, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బీజేపీ నేతలతోపాటు ఆయా కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు అమాత్యుడు రామన్న సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.