కోల్సిటీ, డిసెంబర్ 18: వెల్మల ఐక్యత ఇతర కులాలకు స్ఫూర్తిదాయకమని, వారి అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం గోదావరిఖని ఐబీ కాలనీలోని శివాలయం రోడ్డులో పద్మనాయక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో చేపట్టిన పద్మనాయక కల్యాణ మండప నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని వెల్మలు మానవతాదృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
సంఘ సభ్యులు ఒక కుటుంబంగా వివిధ శుభకార్యాల నిర్వాహణకు కల్యాణ మండపం నిర్మించుకోవడం సంతోషకమరమని పేర్కొన్నారు. వెల్మలు సంఘటితంగా ఉంటూ ఆర్థికాభివృద్ధి సాధిస్తుండడం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, నగర పాలక మేయర్ డా.అనిల్కుమార్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, వెలమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాపారావు, రామ్మోహన్రావు, సాగర్ రావు, సాగి అనిల్రావు, సంతోష్రావు, నడిపెల్లి మురళీధర్రావు, రాజేశ్వరరావు, అశోక్ రావు, పీచర శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా, కల్యాణ మండప నిర్మాణానికి పలువురు విరాళాలు అందజేశారు.