బోయినపల్లి, నవంబరు 30: కొడుకు కండ్లెదు టే ఆ తల్లి తనువు చాలించింది. కుక్కను తప్పించబోయి ఆటో చెట్టును ఢీకొన్న ఘటనలో ఆమె ప్రాణాలు విడిచింది. బుధవారం తెల్లవారుజామున బోయినపల్లి మండలం తడగొండ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. కొడుకు పెండ్లయినా ఆరురోజులకే ఈ విషాద సంఘటన జరగడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బో యినపల్లి ఎస్ఐ అభిలాష్ వివరాల ప్రకారం.. మండలంలోని తడగొండకు చెందిన షేక్ అనీఫా (43)కు ఇద్దరు కొడుకులు మహ్మద్ ఫారూక్, రఫీ. భర్త 20 ఏండ్ల క్రితం మరణించడంతో కూలీనాలీ చేసుకుంటూ బతికేది. ఏడాది నుంచి బోయినపల్లిలో కొడుకుల సాయంతో కరీంనగర్ డెయిరీని నడిపించుకుంటూ జీవిస్తున్నారు.
పెద్ద కొడు కు వివాహం రెండేండ్ల క్రితం జరగగా, గత శుక్రవారం చిన్నకొడుకు రఫీ వివాహం నిర్మల్కు చెంది న యువతితో జరిగింది. బుధవారం సాయంత్రం తడగొండలోని వారి ఇంటిలో వియ్యపు రాళ్ల విందు జరగాల్సి ఉన్నది. ఈ క్రమం లో తెల్లవారుజామున 4: 20 గంటలకు పాల డెయిరీ తీసేందుకు షేక్ అనీఫా, ఆమె పెద్ద కొడుకు ఫారుక్ ఆటోలో బోయినపల్లికి వెళ్తున్నారు. తడగొండ ఊరి శివారులో ఆటోకు అడ్డంగా కుక్క రా వడంతో తప్పించబోయి ప్రమాదవశాత్తు అదు పుతప్పి చెట్టును ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో తల్లి అనీఫా తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు ఫారుక్ తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం కరీంనగర్ దవాఖానకు తరలించారు. కండ్లెదుటే తల్లి మృతిచెందడంతో కుమారుడు కన్నీటి పర్యంతమయ్యాడు. చిన్న కుమారుడు నిర్మల్లో ఉన్న అత్తగారింటి నుంచి హుటాహుటిన వచ్చి తన తల్లి మృతదేహంపై పడి విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. కాగా, మృతురాలి సోదరుడు షేక్ గౌస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.