పెద్దపల్లి, నవంబర్2: ‘అరవైఏండ్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ చేసిందేమీలేదు.. తాగు, సా గునీరివ్వకుండా గోసపెట్టింది..అవినీతి, అరచకా లు సృష్టించి పబ్బంగడుపుకున్నది..కానీ, తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా సాగుతున్నది. వ్యవసాయం పండుగైం ది. అర్హులందరికీ స్కీంలు అందడంతో ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తుది..’ ప్రజలారా ఆలోచించండి..మీరు అరాచక పాలన చేసిన కాంగ్రెస్ వైపు ఉంటారా? సంక్షేమ పాలనందించిన బీఆర్ఎస్ వైపు ఉంటారా? తేల్చుకోండి’ అంటూ పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు.
గురువారం ఎలిగేడు మండలం ధూళికట్టలో ఇంటింటా ప్రచారం ప్రచారం చేశా రు. మ్యానిఫెస్టోనూ చూపుతూ ఓట్లు అభ్యర్ధించా రు. అనంతరం మాట్లాడుతూ ప్రజా సంక్షేమం. అభివృద్ధిని కాంక్షించే కారుగుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే మన కంట్లో మనమే వేలు పెట్టుకున్న వాళ్లమవుతామని హెచ్చరించారు. ధూళికట్ట శివాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. తాను ఎమ్మెలే ్య గా, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా గెలువాలని సాధించాలని శివుడిని వేడుకున్నట్లు చెప్పారు. హస్తం పార్టీ అధికారమిస్తే 3 గంటల కరెంటే దిక్కవుతుందన్నారు.
వారెంటీ లేని కాంగ్రెస్ 6 గ్యారెంటీలను నమ్మవద్దని సూచించారు. ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని చెబుతున్న ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల అ భ్యున్నతి కోసం మ్యానిఫెస్టో రూపొందించారని తెలిపారు. సీఎం కేసీఆర్ పెద్దపల్లిని జిల్లా కేంద్రం గా ప్రకటించడంతో అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని చెప్పారు. మళ్లీ అధికారం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం నిర్మించి పుష్కలంగా సాగునీరందిస్తుండడంతో రెండు పంటలు సమృద్ధిగా పండడంతో రైతుల ఆర్ధిక స్థితిగతులు మెరగుపడ్డాయని వివరించారు. ఎవరెన్నీ మాయమాటలు చెప్పిన నమ్మకుండా కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.