‘కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఎంత అహంకారం. ఎంత బలుపు. 24 గంటల ఉచిత కరెంట్తో సంబురంగా ఎవుసం చేసుకుంటుంటే ఎందుకని మాట్లాడుతడా..? మీ ఇంట్లకెళ్లి ఇస్తున్నవా..? మూడు గంటలే చాలని మాట్లాడుతున్నవ్. ఎట్లా చాలుతదో చెప్పాలి. ఎకురమైనా పారుతదా..? నీకు తెలివి ఉందా..? ఎన్నడన్నా ఎవుసం చేసిన మొఖమేనా..? నీది. మళ్లా 10 హెచ్పీ మోటర్ పెట్టుకోవాలని అంటున్నవ్. మా రైతులు ఎవరైనా అంత పెద్ద మోటర్లు వాడుతరా..? వాడితే ఇప్పుడు పెట్టిన ట్రాన్స్ఫార్మర్లు ఉంటయా..? అయినా ఆ మోటర్ పెట్టుకోవాలంటే రూ.లక్షకు మీదనే ఖర్చయితది. రూపాయి పాయిదా ఉండదు. ఇంకా ధరణిని తీసేసి బంగాళాఖాతంల ఏస్తమని కూడా అంటున్నరు.
ఎందుకేస్తరు..? మీ పాలనలో భూముల సమస్యలతో నరకం చూసినం. ఒకని భూమి మరొకరికి రాసి, తాకులాటలు పెట్టింది మీ హయాంలో కాదా..? మీరేం చేసిన్రు..? రైతులు బాధతో చచ్చిపోతున్నా పట్టించుకోలె. మీరు వస్తే రాష్ట్రం అంధకారం, అడవి అడవి అయితది. అంతేకాదు మోటర్లకు మీటర్లు కూడా పెడుతరు. మీ పాలిత రాష్ర్టాల్లో పెట్టారని కేంద్రం మంత్రి నిర్మల మేడం బాజాప్తా చెప్పింది. మీరద్దు. మీ కరంటువద్దు. మీ తంటా అస్సలే వద్దని’ అంటూ జిల్లా రైతులు మండిపడుతున్నారు. ఎవుసానికి ఇచ్చే ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– కరీంనగర్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ పార్టీ వస్తే మునపటి కష్టాలు వస్తాయి. రైతులకు కరెంటు కష్టాలు తప్పవు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలంటున్నరు. 3 గంటల కరెంటు సరిపోతుందని చెప్పడం మంచి పద్ధతి కాదు. నాకు 2 ఎకరాల పొలం ఉంది. పొలానికి నీళ్లు పెట్టడానికి 5 గంటలకు పైగానే పడుతున్నది. 3 గంటల కరెంట్ వస్తే ఎవుసం చేయడం మాతోకాదు. 10 హెచ్పీ మోటర్ల పెట్టుకోవాలని కాంగ్రెస్ లీడర్లు చెప్పుతున్నారు. 10 హెచ్పీ మోటర్తో చాలా ఇబ్బందులు తప్పవు. కాంగ్రెస్కు ఓటేస్తే ఇదివరకటి బాధలు కోరి తెచ్చుకున్నట్టే అవుద్ది.
-పుట్ట రాజు, రైతు (వాగొడ్డురామన్నపల్లి)
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు కష్టాలు తప్పవు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కరెంట్ కోతలతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ బావుల వద్ద కరెంట్ ఎప్పుడు అత్తదో, ఎప్పుడు పోతదో తెలువక పోతుండే. కరెంట్ వచ్చిన ఆఫ్ కరెంట్ సమస్యతో మోటర్లు కాలిపోతుండే. కరెంట్ వస్తే ఒక్కటే సారి అందరు రైతులు మోటర్లు ఆన్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ల ఫీజులు కొట్టెత్తుండే. కరెంటోళ్లకు ఎన్ని సార్లు ఫోన్ చేసిన రాకపోతుండే. పొలాలు ఎండిపోతాయనే భయంతో రైతులమే ట్రాన్స్ఫార్మర్లు ఎక్కి ఫీజులు వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు కరెంట్ కష్టాలు తప్పడమే కాకుండా 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. ట్రాన్సఫార్మర్లపై భారం లేదు. రైతులకు కష్టాలు లేవు.
– వెల్మరెడ్డి సత్యనారాయణరెడ్డి, రైతు, లలితాపూర్(మానకొండూర్)
10 హెచ్పీ మోటర్ వేసుకుంటే దాన్ని తట్టుకోలేక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రేవంత్రెడ్డి కొనిస్తాడా..?. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల కరెంటుతో వ్యవసాయం మంచిగా చేసుకుంటున్నాం. ఎన్నికల కోసం 10హెచ్పీ మోటర్లు, మూడు గంటల కరెంట్ అని రైతులకు వ్యతిరేకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నడు. ఒక ట్రాన్ఫార్మర్ కింద నాలుగు నుంచి ఐదు మోటర్లతో వ్యవసాయం చేసుకుంటున్నం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు అన్నట్టు 10హెచ్పీ మోటార్ పెట్టుకుంటే ఇద్దరు రైతులు రెండు మోటర్లు పెట్టుకుంటేనే ఆ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది. మిగతా ముగ్గురి పొలాలకు నీళ్లు ఎట్టా..? ఎకువ లోడ్ పడి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మళ్లీ మళ్లీ కొనుకోవాలా? 10 హెచ్పీ మోటర్ కొనాలంటే లక్షకు పైగా ఖర్చు అవుతుంది. మోటర్లతో నీటిని తోడితే ఒకసారిగా భూమిలోని నీరు అయిపోతుంది. మళ్లీ ఊరడానికి చాలా సమయం పడుతుంది. అప్పటివరకు పంటలు ఎండిపోయి నష్టపోవాల్సి వస్తుంది. రేవంత్రెడ్డికి వ్యవసాయం మీద అసలు అవగాహన లేదు. రైతులు ఎప్పటినుంచో 3లేదా 4హెచ్పీ మోటర్లే వాడుతున్నరు. కాంగ్రెసోళ్లు ఇప్పుడు లేనిపోని మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నరు.
– పీచు మల్లారెడ్డి, మోటర్ మెకానిక్, పారువెల్ల (గన్నేరువరం)
పట్వారీ వ్యవస్థలో ప్రతి సంవత్సరం పహనీలు ఛేంజ్ చేసి కొత్తగా ఇస్తురు. పట్వారీలకు అవగాహన లేక తప్పు పేర్లు ఎక్కిస్తురు. ఆ పేర్లు సరి చేసుకోడానికి ఆఫీసుల చుట్టూ తిరిగీ తిరిగి నెరివడుతుం. ధరణి పోర్టల్ వచ్చినంక మా భూములు పట్టాపాసు బుక్కులో భద్రంగ ఉన్నయ్. భూమి కొన్నా.. అమ్మినా అరగంటల రిజిస్ట్రేషన్లు అవుతున్నయ్. ఇప్పుడు ఒక రూపాయి కూడా ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం ఉంటలేదు. 15 రోజుల్లో పాసుబుక్ ఇంటికి వస్తంది. గతంలోనైతే రైతులు మండల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. కింది నుంచి పైదాకా ప్రతి అధికారికి లంచం ఇవ్వాల్సిన పని ఉండేది. తిరిగి దాన్నే కాంగ్రెస్ తీసుకొస్తానంటున్నది. అదే జరిగితే రికార్డులు తారుమారు చేస్తరు. రైతులు చాలా ఇబ్బందులు పడుతరు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మొద్దు.
– గుర్రం జగన్హోహన్ రెడ్డి రైతు (చొప్పదండి)
మేం ఇద్దరన్నదమ్ములం. మా తండ్రికి నాలుగెకరాల భూమి ఉంది. భూమి పంచుకొనే క్రమంలో ధరణి వచ్చింది. అప్పుడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండ మా పేరుపై భూమి పట్టా అయింది. అప్పటి నుంచి ఏ సమస్య లేకుండా రైతుబంధు వస్తంది. వడ్ల అమ్మకాల సమయంలో ఐకేపీ దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నయి. గతంలో లాగా రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకొని పట్టాలో పేర్లు మార్చే అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు లేవు. ధరణి పోతే మళ్లీ 56 కాలమ్స్తో పాత పద్ధతిని కాంగ్రెస్ వాళ్లు తీసుకువస్తామంటున్నరు. ఈ ఎన్నికల్లో రైతులంతా కలిసి కాంగ్రెసోళ్లకు గోరికట్టుడు తప్పదు. ధరణితోనే రైతులంతా సంతోషంగ ఉన్నరు.
-పీ బాల్రెడ్డి, ఐనవారిపల్లె (కొత్తపల్లి)
ధరణి రాకముందు మా నాన్నపేరు మీద వారసత్వ భూములు ఎకించుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. ఇట్లా మా లాగా ఎంతోమంది రైతులు టైటిల్ సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. రికార్డులు కూడా అస్తవ్యస్తంగా ఉండడంతో టైటిల్ కోర్టు కేసులు ఎన్నో నమోదయ్యేవి. కోర్టుల చుట్టూ తిరుగుతూ పక వారితో ఎప్పుడు గొడవలు జరుగుతుండేవి. కానీ ఇప్పుడు గెట్ల పంచాయితీలు తప్ప రికార్డుల పరమైన కేసులు చాలావరకు తగ్గిపోయినయి. రైతు తన భూమిని ఆన్లైన్లో ఎప్పుడంటే అప్పుడు చూసుకుంటూ భరోసాగా ఉంటున్నడు. ధరణి రాకముందు భూమిని ఒక వ్యక్తికి కౌలుకు ఇద్దామంటే భయపడేవాళ్లు. కానీ ఇప్పుడు టైటిల్ క్లియర్గా ఉంటుండడంతో ఎలాంటి భయం లేకుండా ఉంటున్రు.
– సిరికొండ శ్రీధర్ రావు, న్యాయవాది, రామకృష్ణకాలనీ (తిమ్మాపూర్)
వ్యవసాయానికి ఇప్పుడిస్తున్న 24 గంటల కరెంటుతో రైతుకు ఎంతో మేలు జరుగుతున్నది. వ్యవసాయానికి 24 గంటలు కరెంటు సరఫరా చేస్తూ తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నది. ఇంత మంచి విధానాన్ని కాంగ్రెస్ నాయకులు చెడగొట్టే విధంగా కుట్రలు చేస్తున్నరు. రైతాంగం అంతా కాంగ్రెస్ మోసపూరిత మాటలను గమనించాలి. మూడు గంటల విద్యుత్ ఇస్తే రైతులకు గతం పునరావృతమయ్యే పరిస్థితులు ఉన్నయి. బావులు, బోర్ల దగ్గర రాత్రిపూట జాగారం చేయాల్సి వస్తది. ఈ విధానం సరైంది కాదు. ఇప్పుడున్న మోటర్ల స్థానంలో 10హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని చెప్పడం రైతులపై భారం మోపడమే అవుతుంది. రైతులంతా 10 హెచ్పీ మోటర్లు వినియోగిస్తే విద్యుత్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది. ఓవర్లోడ్తో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి వ్యవసాయం ఆగమైతది. ఎన్నికల్లో లబ్ధిపొందడానికే రైతులను మోసం చేసే కుట్ర జరుగుతున్నది.
– కలకొండ వెంకట్ రెడ్డి, (ముకరంపుర)
రైతుల భూ సమస్యల పరిషారం కోసం ధరణి ఎప్పటికీ ఉండాలి. ధరణి లేక ముందు వీఆర్వోలు, పైరవీలతో రైతులు అనేక ఇబ్బందులు పడేవారు. ధరణి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధరణి తీసేస్తే మళ్లీ నాటి ఇబ్బందులు తిరిగి వస్తయి. గ్రామాల్లో భూముల కోసం కొట్లాటలు, కేసులు మరింత పెరుగుతాయి. ఇప్పుడా పరిస్థితి బాగా తగ్గిపోయింది. ధరణి ఉంటేనే అందరికీ లాభం జరుగుతుంది. క్షణాల్లో రిజిస్ట్రేషన్ చేసి పట్టా ఇస్తున్నరు. రైతుబంధు వస్తున్నది. కాంగ్రెస్ కుట్రలను రైతులు గుర్తించి ఓటు అనే ఆయుధంతో దూరం కొట్టాలి. రైతు ప్రభుత్వంగా ముద్ర పడిన బీఆర్ఎస్ను ఆదరించాలి.
-పోరెడ్డి దయాకర్రెడ్డి, రైతు, పెద్దపాపయ్యపల్లి గ్రామం, హుజూరాబాద్(టౌన్) మండలం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి భూమాత అనే పోర్టల్ పెడతమంటున్రు. అటె్లైతే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. మళ్లీ పట్వారి వ్యవసస్తే ఇబ్బందైతది. దీంతో రైతుల భూముల్లో పట్వారులు అవకతవకలకు పాల్పడి అసలైన రైతుది వేరే రైతులకు పట్టా చేస్తరు. దీంతో రైతు నష్టపోతడు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి మూలంగా అసలైన రైతుకు భూమి చెందుతుంది. ధరణి ఉంటేనే రైతులు సంతోషంగా ఉంటరు. ఎన్నికల కోసం కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదు. ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతం.
– నాంపల్లి తిరుపతి, రైతు, మన్నెంపెల్లి (తిమ్మాపూర్ రూరల్)