జగిత్యాల, జనవరి 19(నమస్తే తెలంగాణ) : జగిత్యాల పట్టణానికి సంబంధించి రూపొందించిన మాస్టర్ ప్లాన్ను పూర్తిస్థాయిలో సవరించి, రైతులకు, ప్రజలకు నష్టం జరగకుండా చూస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్కుమార్ హామీ ఇచ్చారు.
జగిత్యాల మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ విషయంలో కొద్దిరోజులుగా జగిత్యాల పట్టణ శివారులోని రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో గురువారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ భూముల్లో ఇండస్ట్రియల్, రిక్రియేషన్, పబ్లిక్, సెమీ పబ్లిక్ జోన్లుగా డ్రాఫ్ట్లో చూపెట్టడంతో ఆయా గ్రామాల రైతులు, భూ యజమానులు ఆందోళనకు గురయ్యారని వారు పేర్కొన్నారు. డ్రాఫ్ట్లో దొర్లిన తప్పులను సవరిస్తామని వెల్లడించారు.