విద్యార్థులకు చదువుతోపాటు శిక్షణ అందిస్తున్నది వేములవాడ మైనార్టీ గురుకుల కాలేజీ. రెండేళ్ల క్రితం వృత్తి విద్యా కోర్సులు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ), లైవ్స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డెయిరీ టెక్నాలజీని అందుబాటులోకి తేగా, సుమారు వంద మంది విద్యార్థులకు బోధనతోపాటు శిక్షణ అందిస్తున్నది. ఎల్ఎంటీ ఫస్టియర్, సెకండియర్ స్టూడెంట్స్కు వేములవాడ ఏరియా దవాఖానలో 60 రోజులపాటు విడుతల వారీగా ట్రైనింగ్ ఇస్తూ నిపుణులుగా తయారుచేస్తున్నది.
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ) కోర్సుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు దవాఖానల్లోనూ మంచి వేతనాలు పొందవచ్చు. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత కూడా బ్రిడ్జి కోర్సుల ఆధారంగా ఏదైనా డిగ్రీలో చేరే అవకాశముంటుంది. అదే విధంగా డీఎంల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ కోర్సులో కూడా చేరవచ్చు. వేములవాడ పట్టణంలోని మైనార్టీ గురుకుల కళాశాలలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, లైవ్స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డెయిరీ టెక్నాలజీ కోర్సులను ప్రభుత్వం రెండేళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు కోర్సుల్లో సుమారు 100మంది విద్యార్థులు మొదటి, రెండో సంవత్సరం విద్యను అభ్యసిస్తుండగా, వృత్తిపరమైన కోర్సులో భాగంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ) కోర్సులో ఫస్టియర్ 23 మంది, సెకండియర్ 25 మంది విద్యార్థులు ఉండగా, వీరికి వేములవాడ ఏరియా దవాఖానలో విడుతల వారీగా 60రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ఆధారంగా 100మార్కుల వరకు ఉంటాయని అధ్యాపకులు తెలిపారు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలుంటాయని చెబుతున్నారు.
అందుబాటులో వృత్తి విద్యాకోర్సులు
గురుకుల కాలేజీలో లైవ్స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డెయిరీ టెక్నాలజీ కోర్సు 40సీట్లు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో 30సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రెండో సంవత్సరం విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకొని బయటకు వెళ్లనున్నారు. ఈ కోర్సు చేసిన విద్యార్థులకు డిగ్రీ చేసే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులు కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి.
– కుమారస్వామి, మైనార్టీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ (వేములవాడ)
శిక్షణలో మార్కులు ఉంటాయి
ఎంఎల్టీ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు 60రోజుల పాటు శిక్షణ కూడా ఉంటుంది. ఇందులో నైపుణ్యం చూపిన వారికి వంద మార్కుల వరకు ఉంటాయి. రెండు విడుతలుగా వేములవాడ, సిరిసిల్ల ఏరియా దవాఖానల్లో శిక్షణను అందిస్తున్నాం.
-శాలిని, మైనార్టీ గురుకుల కళాశాల లెక్చరర్
చాలా హెల్ప్ఫుల్గా ఉన్నది
ఎల్ఎంటీ కోర్సు ద్వారా మంచి ఉపాధి ఉంటుందని ఎంచుకున్న. సెకండియర్ కంప్లీట్ అయింది. గవర్నమెంట్, ప్రైవేట్లో కూడా మంచి జాబ్స్ ఉంటాయని, సాలరీ కూడా ఎక్కువగానే ఉంటుందని తెలుసుకొని ఎల్ఎంటీ కోర్సులో చేరిన. మాకు 60 రోజుల శిక్షణ ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నది.
-భానుతేజ, ఎంఎల్టీ సెకండియర్ విద్యార్థి
ట్రైనింగ్ విధానం బాగుంది
చదువుతో పాటు శిక్షణ ఇస్తున్న విధానం బాగుంది. రెండు నెలలు శిక్షణ తీసుకుంటున్నం. ఉదయం నుంచి సాయంత్రం వరకు హాస్పిటల్కు వచ్చే రోగులకు సంబంధించిన ల్యాబ్ పరీక్షలను పరిశీలిస్తున్నం. మా డౌట్స్ను సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్లు క్లారిఫై చేస్తున్నరు.
– నోవాచంద్, ఎంఎల్టీ సెకండియర్ విద్యార్థి