వేములవాడ టౌన్, అక్టోబర్ 2: వేములవాడ రాజన్న హుండీ ఆదాయం 1.92 కోట్లు సమకూరినట్లు ఆలయ ఈవో డీ కృష్ణప్రసాద్ వెల్లడించారు. బుధవారం రెండోరోజూ రాజన్న ఆలయ ఓపెన్స్లాబ్పై ఈ హుండీ లెక్కింపు నిర్వహించారు.
344.9 గ్రాముల బంగారం, 19. 5 కిలోల వెండి, చిల్లర నాణేలు రూ.5.50 లక్షలు వచ్చాయని పేర్కొన్నారు. ఇది 18 రోజుల ఆదాయం మాత్రమేనని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవోలు హరికిషన్, నవీన్, జయకుమారి, శ్రీనివాస్, పర్యవేక్షకులు, సిబ్బంది, సిరిసిల్ల శివరామకృష్ణ భజన మండలి సేవాసమితి ఆధ్వర్యంలో 400 మంది భక్తులు పాల్గొన్నారు.