సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 21: సాధారణంగా పిల్లలు, యువకులు విహార యాత్రకు వెళ్తుంటారు. మధ్య వయస్కులు వెళ్లడం చూస్తుంటాం. కానీ వృద్ధులు వెళ్లడం మీరెప్పుడైనా చూశారా..? అవును తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులు బుధవారం గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు ప్రాంతానికి వెళ్లారు.
కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలతో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం చొరవతో విహారయాత్రకు వెళ్లిన వృద్ధులు అక్కడే చాలా సేపు సరదాగా గడిపారు. వనభోజనాలు చేశారు. మానేరు డ్యాంను వీక్షించి, ఆటపాటలతో సరదాగా గడిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ మత, అసిస్టెంట్ కోఆర్డినేటర్ వెంకటేశ్, వృద్ధులు ఉన్నారు.