జిల్లాలో రెండు కొనుగోలు కేంద్రాలు
మద్దతు ధరకు విక్రయించేందుకే మొగ్గు
ముకరంపుర, ఫిబ్రవరి 9: కంది రైతులకు కొనుగోలు కేంద్రాలు కొండంత అండగా నిలువనున్నాయి. వానకాలంలో పంట మార్పిడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించింది. పంట మార్పిడి విధానంలో లాభదాయకమైన పప్పు దినుసుల సాగుతో కలిగే ప్రయోజనాలను వ్యవసాయాధికారులు గ్రామాల్లో రైతులకు వివరించారు. వానకాలంలో సాధారణంగా వాణిజ్య సరళిలో పత్తి, మక అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. ప్రభుత్వం చేపట్టిన పంట మార్పిడి విధానానికి రైతులు ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం మారెట్లో పప్పులకు ఎకువ డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా పత్తి సాగు చేసే క్షేత్రాల్లో పప్పు దినుసుల సాగుకు ముందుకు వచ్చారు. మాములుగా అయితే పత్తి చేలల్లో కంది అంతర పంటగా వేస్తుంటారు. ప్రధాన పంటతో పాటు అంతర పంట ద్వారా అదనపు ఆదాయం వస్తుండేది. కాగా, వానకాలం సీజన్లో మాత్రం కొన్ని ప్రాంతాల రైతులు సాగు విధానాన్ని పూర్తిగా మార్చి వేశారు. గతానికి భిన్నంగా పత్తికి బదులు పూర్తిగా కంది సాగు చేశారు.
కేంద్రాలతో ఊరట
వానకాలం సీజన్లో పూర్తి ప్రతికూల పరిస్థితుల్లోనూ దిగుబడి ఎకరాకు సగటున 6 క్వింటాళ్ల వరకు వచ్చింది. రైతులు కోతలు పూర్తి చేసి పంటను మారెట్కు తీసుకువస్తున్నారు. మారెట్లో ప్రైవేట్ వ్యాపారులే కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.6,300 ఉన్నది. కాగా, వ్యాపారులు క్వింటాలుకు రూ.5,500 నుంచి రూ. 5,800 వరకు మాత్రమే చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ లెకన రైతులు క్వింటాలుకు రూ.500 నుంచి రూ.800 వరకు నష్టపోతున్నారు. అంతే కాకుండా హమాలీ, క్యాష్ కటింగ్, ఇతర ఖర్చులు అదనం. మంగళవారం నాటికి జిల్లాలోని మారెట్లలో వ్యాపారులు రైతుల నుంచి 772 క్వింటాళ్లు ఖరీదు చేశారు. ధర విషయంలో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మద్దతు ధరకు కంది పంట కొనుగోలుకు నిర్ణయించింది. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్తో పాటు గంగాధర మారెట్లలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అండగా నిలిచింది. పంటను మద్దతు ధరకు అమ్ముకునే అవకాశం లభించడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కరీంనగర్ వ్యవసాయ మారెట్ యార్డులో కుప్ప వద్ద కందులు చూపిస్తున్న ఈ రైతు పేరు కామెర నర్సయ్య. తిమ్మాపూర్ మండలం నల్లగొండ. గ్రామంలో 12 ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు. ఎనిమిది ఎకరాల్లో పత్తికి బదులు కంది సాగు చేశారు. కౌలుతో కలుపుకొని రూ.2లక్షల వరకు సాగు కోసం ఖర్చు చేశారు. కొద్ది రోజుల క్రితం పంట కోశారు. సుమారు 50 క్వింటాళ్లకు పైగా వచ్చిన దిగుబడిని మారెట్కు తెచ్చి రాశిగా పోశారు. వ్యాపారులు క్వింటాలుకు ధర రూ.5,800 చెల్లించి కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. మద్దతు ధరతో పోల్చితే ప్రైవేట్ వ్యాపారులు చెల్లించే ధర రూ.500 తకువ. ఈ లెకన 50 క్వింటాళ్లకు రూ.25 వేలు, హమాలీ, ఇతర ఖర్చులు కలిపి మరో రూ.5వేల వరకు అసలు మొత్తం నుంచి నష్ట పోవాల్సి వస్తున్నది. దీంతో మారెట్లోని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు నిర్ణయించడంతో కేంద్రం నిర్వాహకులు కందుల కొనుగోలుకు ముందుకు వచ్చారు. దీంతో సదరు రైతుకు అదనపు ఖర్చులు ఏమీ లేనందున రూ.30 వేల వరకు లాభం చేకూరింది.