విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే గుండెపోటుతో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మృత్యువాతపడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కోరుట్ల/ శంకరపట్నం మార్చి 2: కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లోకిని రాజేందర్ (53) శుక్రవారం విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఛాతిలో నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో శనివారం వేకువజామున మృతిచెందాడు. రాజేందర్ మృతదేహానికి మెట్పల్లి డీఎస్పీ ఉమా మహేశ్వరరావు, ఎస్ఐ కిరణ్, పోలీస్ సిబ్బంది నివాళులర్పించారు. మృతుడికి భార్య పద్మ, కొడుకు సతీశ్, కూతురు శైలజ ఉన్నారు.
శంకరపట్నం మండలం తాడికల్ విద్యుత్ సబ్ స్టేషన్లో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్గా పని చేస్తుస్తున్న ఎన్పీడీసీఎల్ ఉద్యోగి సయ్యద్ అశ్వక్ హుస్సేన్ (60) శనివారం విధులు నిర్వహించిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందాడు. కరీంనగర్కు చెందిన ఆయనకు ఇతనికి భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఉద్యోగి మృతిపై ఏఈ సంపత్రెడ్డితో పాటు సహచర ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.