టీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ లాజిస్టిక్ సెంటర్ లాభాల బాటలో పయనిస్తోంది. ఆదాయంలో హైదరాబాద్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 డిపోల నుంచి లాజిస్టిక్స్ సేవలను కొనసాగిస్తుండగా, నవంబర్ నెలలో రూ.77,94,101ల ఆదాయం సాధించింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లాజిస్టిక్ సెంటర్ టాప్లో నిలుస్తున్నది. ఇక్కడి నుంచి ప్రతి రోజూ కరీంనగర్ జిల్లా కేంద్ర నుంచి హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ వంటి వ్యాపార ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాలకు చేరవేసేందుకు వెయ్యి పార్సిల్స్ బుకింగ్ అవుతుంటాయి. వివిధ ప్రాంతాల నుంచి కరీంనగర్కు 800 వరకు పార్సిల్స్ వస్తున్నాయి. ఈ సెంటర్లో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయగా, ఒకటి బుకింగ్ పార్సిల్ కోసం, మిగతా మూడు డెలివరీ కోసం పని చేస్తుంటాయి. సేవలు అందించడానికి 12 మంది శాశ్వత సిబ్బంది, మరో 13 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది, వస్తువులు దిగుమతి, ఎగుమతి చేయడానికి 45 మంది హమాలీలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వస్త్ర వ్యాపారులు, సీడ్స్ కంపెనీలు, విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీల నిర్వాహకులు లాజిస్టిక్స్ సేవలను వినియోగించుకుంటున్నారు.
లాజిస్టిక్ ద్వారా భద్రాచలం శ్రీరాముల వారి తలంబ్రాలను అందించడంతో ప్రజల్లో గుర్తింపు వచ్చింది. జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి తలంబ్రాలను ఇంటివద్దనే అందిజేశాం. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులుతో పాటు ప్రతి ఒక్కరూ లాజిస్టిక్ సేవలను అభినందించారు.దీంతో లాజిస్టిక్ వినియోగదారుల సంఖ్య పెరిగింది.పార్సిల్ ను సమయానికి డెలివరీ అందించడం.ఎక్కువ దూరానికి తక్కువ చార్జీలతో వస్తువులను అందించడంతో ప్రైవేట్ కొరియర్ సంస్థలు కూడ లాజిస్టిక్ అశ్రయిస్తున్నారు.రానున్న రోజుల్లో ఆధునీకరణ పద్దతులతో సేవలను అందిస్తాం.
– రాజు (కరీంనగర్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ )
ఇక్కడి నుంచి లాజిస్టిక్లో హైదరాబాద్కు బుక్ అయిన వస్తువును ఆరు గంటల్లో డెలివరీ చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా డెలివరీ చేసేందుకు ఫాస్ట్ క్విక్ డెలవరీ(ఎఫ్కేడీ) సదుపాయం అందుబాటులో ఉంది. దీని ద్వారా 200 గ్రాముల లోపు వస్తువును వివిధ పట్టణ ప్రాంతాలకు ఆరు గంటల్లో డెలివరీ చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో లాజిస్టిక్ సేవలను అందించడానికి పది శాతం కమీషన్పై ప్రైవేట్ వ్యక్తులను పీసీసీలుగా నియమించారు. వీరి ద్వారా కౌంటర్లను కొనసాగిస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారుల కోసం కార్పొరేట్ బల్క్ బిజినెస్ (సీబీబీ) పద్ధతిని కొనసాగిస్తున్నారు.
దీని ద్వారా వ్యాపారులతో లాజిస్టిక్ అధికారుల ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. వ్యాపారుల నుంచి వస్తువులను సేకరిచండమే కాకుండా వారు కోరితే డెలివరీ కూడా చేస్తున్నారు. వీరి వద్ద నుంచి నెల వారీగా చార్జీలను తీసుకుంటున్నారు. త్వరలో బార్ కోడ్, స్కానింగ్ విధానాన్ని లాజిస్టిక్ సెంటర్లలో అమలు చేయనున్నారు. మొదట జేబీఎస్, కరీంనగర్ కేంద్రాల్లో అమలు చేసేందుకు సాఫ్ట్వేర్ను డెవలప్ చేస్తున్నారు. బార్ స్కానింగ్ విధానంతో వినియోగదారులు పంపించే వస్తువుల చిరునామా, పంపించే వస్తువు సులంభంగా గుర్తించ వచ్చు.
ఆర్టీసీ లాజిస్టిక్ సేవలను ప్రజలు అదిరిస్తున్నరు. వినియోగదారులు పంపిస్తున్న ప్రతి పార్సిల్ను భద్రంగా అందజేస్తున్నం. 200 కిలో మీటర్లు లోపు పంపించే వస్తువులను ఆరు గంటల్లో డెలివరీ చేస్తున్నం. వ్యాపార, విద్యాసంస్థలు, మెడికల్ కాలేజీలు, సీడ్స్ సంస్థల నిర్వాహకులను ప్రత్యేకంగా కలుసుకొని వారికి లాజిస్టిక్ సేవలను వివరిస్తున్నం. కరీంనగర్ బస్టాండ్లో 24 గంటల సేవలు అందిస్తున్నం. వస్తువులు సెంటర్కు చేరుకోగానే వారి సెల్ ఫోన్కు సమాచారం చేరుతుంది. దీంతో వినియోదారుడు ఎప్పుడు వచ్చినా డెలివరీ అందిస్తున్నం. త్వరలోనే బార్ కోడ్ స్కానర్ విధానాన్ని అందుబాటులోకి తెస్తం.
– సదాశివ్(అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ కరీంనగర్ రీజియన్)