గంభీరావుపేట, ఫిబ్రవరి 8: నాబార్డు ఆధ్వర్యంలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్పై ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో బుధవారం శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నాబార్డు గ్రామీణ మహిళలకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్పై ఉచితంగా శిక్షణ ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. 15 రోజుల పాటు శిక్షణ అనంతరం సర్టిఫికెట్తో పాటు 750 ైస్టెపెండ్ అందిస్తారని తెలిపారు.
గ్రామానికి చెందిన వంగ పుల్లమ్మ, ఎల్లారెడ్డి మృతి చెందగా బాధిత కుటుంబాలను రవీందర్రావు పరామర్శించారు. కార్యక్రమంలో సర్పంచులు సిరిగిరి లక్ష్మి, అజ్మీర బాల్యానాయక్, ఎంపీటీసీ మూడావత్ కవిత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, గ్రామాధ్యక్షుడు కొలనూరి వేణుగోపాల్, నాబార్డు డీజీఎం మనోహర్రెడ్డి, బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్రెడ్డి, ఏపీఎం సుదర్శన్, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, కొత్తింటి హన్మంతరెడ్డి, రాజిరెడ్డి, బాల్రెడ్డి, రాంరెడ్డి, అంబర్సింగ్, శేఖర్గౌడ్, అంజిరెడ్డి, నాబార్డు బృందం సభ్యులు నరేశ్, మల్లికార్జున్, కరుణాకర్ పాల్గొన్నారు.