
DGP Shivadhar Reddy | వేములవాడ, ఏప్రిల్ 24: వేములవాడ భీమేశ్వర స్వామి వారిని డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శించుకునేందుకు ఆలయంలో పలికి రాగానే శివధర్ రెడ్డికి అతిథి మర్యాదల ప్రకారం పూలమాల వేసి స్వాగతం పలికారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనకు ఆశీర్వచనం గావించి స్వామివారికి తీర్థప్రసాదాలను డీఈవో భాస్కర శర్మ, అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బిగితే, అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్డీవో రాధాబాయి, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.