మారుతీనగర్, జూలై 7 : జగిత్యాల జిల్లా మెట్పల్లి లో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు డప్పు చప్పుళ్ల మధ్య నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి సమర్పించి మొక్కులు చె ల్లించుకున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల వి ద్యాసాగర్రావు దంపతులు అమ్మవారికి బోనం సమర్పించి, 2లక్షల విలువైన ఆభరణాలను అందజేయగా ఆలయ కమిటీ స భ్యులు అమ్మవారికి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే దంపతులను సత్కరించి మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత కల్వకుంట్ల సంజయ్ అమ్మవారికి పూజలు చేశారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మెట్పల్లి బల్దియా చైర్పర్సన్ సుజాత-సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు.