వేములవాడ, ఫిబ్రవరి 20: ‘కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించాం. ఇప్పుడు ఉన్నపలంగా తొలగించడం అన్యాయం. మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోండి’ అంటూ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు తొలగించిన నర్సింగ్ స్టాఫ్ విజ్ఞప్తి చేశారు. ఇటీవల రెగ్యులర్ స్టాఫ్ నర్సులు విధుల్లో చేరడంతో వేములవాడ ఏరియా దవాఖానలో ఔట్సోర్సింగ్పై పనిచేస్తున్న 14 మందిని తొలగించారని మంగళవారం ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
మూడేండ్లుగా పనిచేస్తున్న తమను సోమవారం నుంచి విధులకు హాజరుకావద్దని అధికారులు ఆదేశించారని తిర్మాజ, ఎం జ్యోతి, బీ జ్యోతి, రూత్, దీపిక, శ్రీలత, బాలకిషన్, మమత, శ్రీలత, రాజేశ్వరి, ప్రవీణ్, జ్యోత్స్న, జ్యోతి, ఏఎన్ఎం జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎకడైనా ఖాళీగా ఉన్నచోట సర్దుబాటు చేయాలని కోరారు. తొలగించిన నర్సింగ్ స్టాఫ్ను వెంటనే వేరే చోట సర్దుబాటు చేసి ఉపాధి కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.