కలెక్టరేట్, నవంబర్ 8: తెలంగాణలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారని ఎంఐఎం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ నామినేషన్ సందర్భంగా నగరంలో నిర్వహించిన ర్యాలీలో ఎంఐఎం కార్పొరేటర్లు, పలు డివిజన్ల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ, కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ నాలుగోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బరత్ అలీ, జాయింట్ సెక్రటరీ హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసుఫ్, అతీఫ్ అతీన, ఎంఐఎం కార్పొరేటర్లు అఖిల్ ఫిరోజ్, షర్ఫొద్దీన్, నాయకులు అలీబాబా, అజర్ దబీర్, 36 డివిజన్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.