శంకరపట్నం, జనవరి 11: తెలంగాణ సర్కారు పేదలకు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. తొలిపొద్దు పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే బుధవారం తెల్లవారుజామున మండలంలోని ఎరడపల్లి, తాడికల్, అంబాల్పూర్, కేశవపట్నం, ముత్తారం, కన్నాపూర్, రాజాపూర్, మొలంగూర్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఇటీవల మరణించిన, గాయపడిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం ఎందరో నిరుపేద తల్లిదండ్రులకు సర్కారు అండగా నిలుస్తున్నదన్నారు.
తొలిపొద్దు పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే తెల్లవారకముందే గ్రామాలకు వచ్చి లబ్ధిదారుల తలుపులు తట్టారు. ఆయా గ్రామాల ప్రజలు ఆయనను మంగళహారతులు, పూలమాలలతో సాదరంగా ఆహ్వానించారు. ఇంటికే వచ్చి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు క్రుతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మహిళలు, విద్యార్థులు, చిన్నారులతో ముచ్చటించి, వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ పులికోట రమేశ్, సర్పంచుల ఫోరం చైర్మన్ పల్లె సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం చైర్మన్ పెద్ది శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు కలకుంట్ల రంజిత్రావు, కీసర సుజాత, ముంజ వసంత, పంజాల రేణుక, కాటం వెంకటరమణారెడ్డి, పిన్రెడ్డి వసంత, మోరె అనూష, ఎంపీటీసీలు సంపత్, మోతె భాగ్యలక్ష్మి, తిరుపతయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ వీరస్వామి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, నాయకులు ఉమ్మెంతల సతీశ్రెడ్డి, మోత్కూరి సమ్మయ్య, అంతం తిరుపతిరెడ్డి, కోటిలింగం, శ్యాంరావు, శేషాచారి, ఎల్లారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.