కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మరోసారి ఉద్యమకారుడికి అవకాశం దక్కింది. విద్యార్థినేత, టీఆర్ఎస్వీ నాయకుడు రేకుర్తికి చెందిన పొన్నం అనిల్కుమార్గౌడ్ను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం కాగా, బుధవారం అభిమానులు సంబురాలు చేసుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్తో అనిల్కుమార్ హైదరాబాద్లో సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
కార్పొరేషన్/ కొత్తపల్లి, సెప్టెంబర్ 14: కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మరోసారి ఉద్యమకారుడికి సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. పొన్నం అనిల్కుమార్గౌడ్ను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి వాకాటి అరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా చొప్పదండికి చెందిన విద్యార్థి నాయకుడు ఏనుగు రవీందర్రెడ్డికి తొలిసారిగా అవకాశం కల్పించారు. రెండోసారి సైతం విద్యార్థి ఉద్యమనాయకుడైన పొన్నం అనిల్కుమార్గౌడ్ను చైర్మన్గా నియమించారు.
కరీంనగర్ జిల్లా రేకుర్తికి చెందిన అనిల్కుమార్గౌడ్ ప్ర స్తుతం టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. ఎంఎస్సీ ఎల్ఎల్బీ విద్యనభ్యసించిన ఆయన గతంలో ఎస్ఆర్ఆర్ కళాశాల టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా, టీఎస్జేఏసీ కన్వీనర్గా, శాతవాహన యూనివర్సిటీటీ టీఆర్ఎస్వీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, శాతవాహన యూనివర్సిటీ జేఏసీ కన్వీనర్గా, టీఆర్ఎస్వీ కరీంనగర్ నియోజకవర్గ కన్వీనర్గా కొనసాగారు. ప్రస్తుతం టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నారు. అతని సేవలను గుర్తించిన టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమిస్తూ జీవో జారీ చేసింది. అనిల్కుమార్ నియామకంపై తెలంగాణ చౌక్లో టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు సంబురాలు జరుపుకున్నారు.