చొప్పదండి, అక్టోబర్ 19: తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక పథకాలు అమలు చేస్తున్నారని, అవే కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యేందుకు దోహదపడుతాయని చొప్పదండి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని గుమ్లాపూర్, కాట్నపల్లి, సాంబయ్యపల్లి, కోనేరుపల్లి, మల్లన్నపల్లి, రుక్మాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో భాగంగా ఆయన గ్రామాల్లో గడపగడప తిరుగుతూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ, నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో తనను మరోసారి ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఎన్నికలైన తర్వాత ఇప్పటిదాకా ఏనాడూ నియోజకవర్గానికి రాని స్థానికేతరులైన ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని, స్థానికుడినైన తనను మరోమారు ఆదరించి కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలో వచ్చిన వెంటనే అమలు చేయబోయే పథకాల గురించి వివరించారు. తొమ్మిదేండ్లలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసి తీరుతామని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోయి ఓటేస్తే 5ఏళ్లు గోసపడుతామని, తెలంగాణ ప్రభుత్వ పథకాలు నిలిచిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రచారంలో జిల్లా గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, సింగిల్విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, సర్పంచులు అప్పిడి సౌజన్య, లింగంపల్లి లావణ్య, పెద్ది శంకర్, వెల్మ నాగిరెడ్డి, గుంట రవి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్వై నియోజకవర్గ ఇన్చార్జి బందారపు అజయ్కుమార్ గౌడ్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.