కమాన్చౌరస్తా, నవంబర్ 15: ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కృష్ణ మంగళవారం మృతిచెందగా, ఆయనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. ఆయన రెం డుసార్లు కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చారు. 1997లో వచ్చిన సంభవం సినిమాలో పలు సన్నివేశాలను కరీంనగర్లోనే చిత్రీకరించారు. కోర్టు వద్ద ఓ పాటను, కమాన్చౌరస్తా, ఉజ్వల పార్ వద్ద కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందుకోసం ఐదు రోజులు ఆయన జిల్లాలోనే బస చేశారు. అదే 1997లో తన సొంత పద్మాలయ బ్యానర్పై ఎన్ శంకర్ దర్శకత్వంలో తీసిన ఎన్కౌంటర్ సినిమా విజయోత్సవ వేడుకల కోసం శ్రీనివాస థియేటర్కు వచ్చారు.
ఇంకా కృష్ణ పుత్ర మహేశ్బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు పలుమార్లు ఆయన్ను హైదరాబాద్లో కలిసి పలు సందర్భాల్లో అభినందించి, స న్మానించారు. కృష్ణ 1989లో తీసిన గండపేట రహస్యం సినిమాలో తిమ్మాపూర్ మండల కేం ద్రానికి చెందిన సినీ, టీవీ నటుడు, విలన్ పాత్రధారి కేతిరెడ్డి మల్లారెడ్డి మెయిన్ విలన్గా నటించారు. 2001లో వచ్చిన అన్నయ్య సీరియల్లో కృష్ణ కాంబినేషన్లో మల్లారెడ్డి ఇన్స్పెక్టర్ పాత్ర పోషించారు. తమ అభిమాన హీరో, సినీ దిగ్గజం మృతిచెందడంపై ఫ్యాన్స్, నగరవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు. 1997లో సంభవం సినిమా కోసం జిల్లా కేంద్రంలోని కమాన్చౌరస్తా వద్ద చిత్రీకరించిన సన్నివేశం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. వాట్సాప్ స్టేటస్లలో తెగ చక్కర్లు కొడుతున్నది.
జిల్లా వాసుల సంతాపం..
కృష్ణ మృతికి జిల్లాకు చెందిన పలువురు అభిమానులు సంతాపం తెలిపారు. ఆయన్ను ఎప్పు డు కలిసినా తమను ఎంతో ఆప్యాయంగా పేరుపేరునా పలకరించి మాట్లాడేవారని ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మానగోని సంతోష్ గౌడ్, పీచర కృష్ణమాచార్య గుర్తుకు చేసుకున్నా రు. సినిమా రంగంలో నూతన సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన గొప్ప నటుడితో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని కేతిరెడ్డి మల్లారెడ్డి పేరొన్నారు. కృష్ణ మృతికి సంతాపం తెలిపిన వారిలో అభిమానులు మల్లన్న, గంగన్న, రమేశ్, అశోక్, సదానందం, వసీం, హరీశ్, విజయ్చారి, శ్రీకాంత్, పవన్, సమైక్యసాహితీ అధ్యక్షుడు మాడిశెట్టి గోపాల్, కఫిసొ అధ్యక్ష, కార్యదర్శులు పొన్నం రవిచంద్ర, లక్ష్మి గౌతమ్, సినీ విమర్శకుడు వారాల ఆనంద్, మాడ్రన్ ఆక్టింగ్ సూల్ ఆఫ్ కరీంనగర్ చైర్మన్ అనసూరి భూనాథాచారి, చైతన్యకళాభారతి బాధ్యులు హరిహర శకళ్ల, మంచాల రమేశ్, తిప్రర్తి ప్రభు, గుండ మల్లయ్య, పబ్బా రాజమౌళి, మున్ననూరు రాజేశ్వర్ రావు, శక్తి రాజు, పిట్టల రమేశ్, గంగారెడ్డి, అభి, శ్రీరాజ్, మల్లేశ్ తదితరులు ఉన్నారు.