కరీంనగర్ కార్పొరేషన్, మే 30 : కాళేశ్వరం ప్రా జెక్టు నుంచి చుక నీరు వాడకుండా రికార్డు స్థాయి లో పంట పండించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు పచ్చి అబద్ధాలు మాట్లాడారని, ఇప్పటికైనా అలాంటివి మానుకోవాలని హితవుపలికారు. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్చార్జి మంత్రిగా జిల్లాకు ఏమైనా ఇచ్చారా?, కేవలం అబద్ధాలు మాట్లాడడం కోసం వచ్చారా? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో కేవలం రెండు పిల్లర్లకే పగుళ్లు వచ్చినంత మాత్రాన కూలిపోవడం అంటారా? అని ప్రశ్నించారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ మంత్రులు కూలిపోయిందంటూ చేస్తున్న ప్రచారం మానుకోవాలని హితవుపలికారు. చంద్రబాబు, రేవంత్రెడ్డి ఒకటై నీటిని పోలవరం దికు వదులుతున్నారని ఆరోపించారు. 2022-2023లో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండిందని, దానికి ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టు అని పేరొన్నారు. మొన్న కరువు వచ్చేలా ఉందని మిడ్ మానేర్ నింపారని, ఆ నీరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కేసీఆర్ను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరంపై విమర్శలు చేయడం మాని వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులను అరిగోస పెడుతున్నారని, ఇప్పటివరకు సుమారు 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అలాగే ఉందని, జీలుగు విత్తనాలు రాలేదని, రైతు భరోసా ఏమైందని ప్రశ్నించారు. వానకాలం పంటకు విత్తనాలు, ఎరువులు కొనే సమయం వచ్చిందని, కాంగ్రెస్కు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతుభరోసా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం మీద మరొకసారి అవాకులు చెవాకులు పేలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దేశానికి అన్నం పెట్టే స్థాయిలో హర్యానా, పంజాబ్కు దీటుగా తెలంగాణ ఉందని, దానికి కారణం కేసీఆర్ అని స్పష్టం చేశారు. రైతు బీమా రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. నారాయణఫూర్ నిర్వాసితులకు వెంటనే పరిహారం ఇవ్వాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాము పని చేస్తామని, వందేళ్లయినా బీఆర్ఎస్ అలాగే ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు పొన్నం అనిల్కుమార్గౌడ్, చొప్పదండి నియోజకవర్గ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.