కరీంనగర్ కమాన్చౌరస్తా, మే 17: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ఎప్సెట్-2026 ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీ స్ఫూర్తిశ్రీ 1,338, ఈ అఖిల 1,890, ఎస్ భార్గవి 1,512, షేక్ హుస్సేన్ జాఫర్ 2,589, ఎస్ హారిక 2,592, ఎస్ రవి 3,823, మహేశ్వరి 3,455, ఏ సుహాస్యారెడ్డి 3,548, ఎం సాయి సాత్విక్ 3,806, బీ సాయిఅఖిల్ 4,325, బీ విఘ్నేష్వర్ధన్ 4,824, పీ హాసినిరావు 5,600 ర్యాంకులు సాధించారని చెప్పారు.
30విద్యార్థులు 10వేలలోపు ర్యాంకులు కైవసం చేసుకున్నారన్నారు. అత్యున్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ విజయ సాధనకు తోడ్పడిన అధ్యాపకులకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాళాలల డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, డీన్ జగన్మోహన్రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఏజీఎం శ్రీనివాస్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.