Odela | ఓదెల, జులై 24: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రూపు నారాయణపేట గ్రామ శివారులోని మానేరు చెక్ డ్యాంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు చెక్ డ్యాం నీటిలో ఈత కొట్టడానికి చేలిక ఆదిత్య, యశ్వంత్ ఇద్దరు విద్యార్థులు శుక్రవారం వెళ్లారు. నీటిలో ఈత కొడుతుండగా మానేరు గుంతలో పడి ఆదిత్య మృతి చెందాడు. యశ్వంత్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
వీరిద్దరూ పోత్కపల్లిలోని హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నారు. విద్యార్థి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరుగా విలపిస్తున్నారు. దీంతో రూపు నారాయణపేట గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి పరిశీలిస్తున్నారు.