జమ్మికుంట, అక్టోబర్22 : ఎన్నికల నేపథ్యంలో సెంట్రల్ ఆర్మ్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ ఎస్హెచ్ అనూజ్కుమార్ నేతృత్వంలో 75 మంది సభ్యులుగల ఫోర్స్ ఆదివారం తెల్లవారుజామున జిల్లాలోనే మొదటగా జమ్మికుంట పట్టణానికి వచ్చింది.
ఈ సందర్భంగా హుజూరాబాద్ ఏసీపీ ఎల్ జీవన్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ సీఐ బర్పాటి రమేశ్, ఎస్ఐ శ్రీధర్ వారికి పూల దండలు, పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఎన్నికలను ప్రశాంతమైన వాతారణంలో నిర్వహించేందుకు కేంద్ర బలగాలు వచ్చాయని సీఐ తెలిపారు.