Vemulawada | వేములవాడ, మార్చి 20 : వేసవి సెలవుల్లో చేపట్టనున్న జనగణ విధులకు సీనియార్టీని పరిగణలోకి తీసుకోవాలని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేటర్ అధ్యక్షుడు చిప్ప యాదగిరి అన్నారు. వేములవాడ తహసీల్దార్ జయంత్ కుమార్ కు శుక్రవారం వినతి పత్రం అందజేసి మాట్లాడారు. జనగణలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లుగా ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకునే క్రమంలో సీనియార్టీని పరిగణలోకి తీసుకోవాలన్నారు. వేములవాడ పట్టణం, పరిసర గ్రామాలలో ఈ జనగణన చేసే సమయంలో అక్కడ ఉన్న వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు.
వేసవి సెలవుల సందర్భంగా మూల్యాంకనం ఉన్న ఉపాధ్యాయులకు కూడా మినహాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అసోసియేటర్ అధ్యక్షుడు మాడిశెట్టి మహేష్, వేములవాడ పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లావు కిరణ్ కుమార్, శ్రీపతి రాంప్రభు, వేములవాడ గ్రామీణ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోటోజు రమేష్, గడప మధూకర్, కార్యవర్గ సభ్యులు యు. మహేష్, జి.రాజేశంలు ఉన్నారు.