కొత్తపల్లి, జనవరి 26 : తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఈనెల 26 నుంచి 30 వరకు జరిగే జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎం పికైనట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్ బా ల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వీర్ల వెం కటేశ్వరరావు,బాసరవేణి లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగిన 44వ జునియర్ మెన్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన క్రీడాకారుడు గుర్రం తిరుమలేశ్, మానకొండూర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్కు చెందిన వర్షిత్ అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యారన్నారు.
వీరిని డీవైఎస్ఓ రాజావీరు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కాసర్ల ఆనంద్కుమార్, రమణరావు, ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి నమిలికొండ ప్రభాకర్ అభినందించారు.